Samartha Palakudu Sir Thomas Munro
- Ravinuthala Sriramulu
సమర్థ పాలకుడు సర్ థామస్ మన్రో (సంక్షిప్త జీవితగాథ)
- రావినూతల శ్రీరాములు
ఇంగ్లండులో పుట్టి గ్లాస్గో విశ్వవిద్యాలయంలో చదువులలోను, ఆటపాటలలోనూ పేరుతెచ్చుకొని 18 సంవత్సరాల వయస్సులోనే మద్రాసుకు మిలటరీ ఉద్యోగిగా మన్రో వచ్చారు. 12 సంవత్సరాలు హైదర్ ఆలీ, టిప్పుసుల్తాన్లతో యుద్ధాలలో పాల్గొన్నారు. 7 సంవత్సరాలు పరిపాలనలో మెలకువలు నేర్చుకొన్నారు. వారు అక్కడే సర్వే, రెవిన్యూ పద్ధతులను రూపొందించారు. తరువాత మద్రాసు రాష్ట్రం అంతటా వాటిని అమలు పరిచారు. 1800-1807లో అల్లకల్లోలంగా ఉండిన దత్తమండలంలో సుస్థిరపాలన స్థాపించడానికి దత్తమండలం కలెక్టర్ గా మన్రో నియమింపబడ్డారు. మన్రోగారు “ఇది కొత్తది కాదు. తరతరాలుగా ఇక్కడ అమలులో నున్న సంప్రదాయ పద్ధతి” అని అప్పటి గవర్నర్ను ఒప్పించి, రైతువారీ పద్ధతిని శాశ్వతంగా పేదరైతులను కాపాడేందుకు ప్రవేశపెట్టారు. అందుకే రాయలసీమలో వారి పట్ల అపారమైన గౌరవం ఎన్నో గ్రామాలలో, పట్టణాలలో ఈనాటికీ వారిని స్మరించుకొంటున్నారు.
Title | సర్ థామస్ మన్రో |
Writer | రావినూతల శ్రీరాములు |
Category | చరిత్ర |
Stock | Available |
ISBN | --- |
Book Id | EBT017 |
Pages | 48 |
Release Date | 01-Nov-2020 |