పిలకా గణపతి శాస్త్రి 1911 ఫిబ్రవరి 24 న తూర్పు గోదావరి జిల్లా కట్టుంగ గ్రామంలో జన్మించాడు. విజయనగరం సంస్కృత కళాశాలలో సాహితీ విద్యా ప్రవీణ పట్టా పొందాడు. ఆయన రాజమహేంద్రవరం ఆంధ్ర యువతీ సంస్కృత పాఠశాలలోను, వీరేశలింగం పాఠశాలలోను తెలుగు పండితుడుగా పనిచేశాడు. కవిగా, వ్యాఖ్యాతగా, నవలా రచయితగా, అనువాదకునిగా, ఆర్ష విద్వాంసుడుగా పత్రికా సంపాదకుడుగా విశేష ఖ్యాతి పొందాడు. పిలకా గణపతి శాస్త్రి ఆంధ్ర శిల్పి, ఆంధ్రభారతి, ఆంధ్రప్రభ వంటి పత్రికలకు సహాయ సంపాదకుడుగా పనిచేశాడు. గణపతి శాస్త్రిగారు జనవరి 2, 1983లో మరణించారు.