వీరు హైదరాబాదు లోని రిఫా-యె-ఆం ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా, ఆ తర్వాత ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లోనూ, శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాల, పాలెంలోనూ ఉపన్యాసకులుగా పనిచేశారు. అసోసియేట్ ప్రొఫెసర్గా 2008లో పదవీ విరమణ చేశారు.
'ప్రథమాంధ్ర కల్పిత కావ్యము - ధనాభిరామము' వీరి ఎం.ఫిల్ సిద్ధాంత గ్రంథం. పిహెచ్.డి సిద్ధాంత గ్రంథం 'వనపర్తి సంస్థానము - తెలుగు సాహిత్య సేవ' ను ఓరియంట్ లాఙ్మన్ ప్రచురించింది. వీరి 'తెలుగు వ్యాకరణ దీపిక' కూడా ఓరియంట్ లాఙ్మన్ ప్రచురణే. వివిధ సదస్సులలో పరిశోధన పత్రాలు సమర్పించారు. వివిధ సంచికల్లో వ్యాసాలు ప్రచురించారు.