Na Smrithipathamlo Saaguthunna Yatra
అచంట జానకిరామ్ఎన్ని జ్ఞాపకాలో ! వద్దు అనుకున్నా ముసురుకొని వస్తాయి జ్ఞాపకాలు. ఎన్ననీ ! ఏభై ఏళ్ళ జీవితపు విషయాలెన్నో 'నేను ముందు' 'నేను ముందు' అనుకుంటూ వస్తాయి.
అన్నిటి కంటె ముందు మా అమ్మను గురించిన జ్ఞాపకం.
ఎప్పటి మాట ! నాకు నాలుగో ఏట అనుకుంటాను! నాన్నలా ఉండాలని పొడుగు కోటు తొడుక్కుని బడాయిగా ఇటూ అటూ పచారు చేస్తుండగా నాన్న, అమ్మ నన్ను చూచి నవ్వుకొన్న జ్ఞాపకం, పార్థసారథి కోవిలలో ప్రభల ఉత్సవం చూచిన జ్ఞాపకం. అప్పుడే కొత్తగా అవతరించిన పార్శీ నాటకంలో సీను మీద నిగనిగ లాడే ఎర్రని పూలతో విరగ పూసిన దానిమ్మ చెట్టు-అబ్బ! ఎంత అందంగా ఉంది! ఇవన్నీ ఎప్పటి కబుర్లు! ఏదో ఆటలో చిన్న గాయం తగిలి, రక్తం వస్తే ఎంత భయపడి పోయింది, అమ్మ.... నాకోసం ఎంత తాపత్రయ పడింది! అదే ఆమెను గురించిన ఆఖరి జ్ఞాపకం.... తర్వాత, ఆమె మనకు దక్కకుండా పోయింది.
అమ్మ తర్వాత, ఈ జీవితంలో ఎందరెందరు ప్రవేశించారో !
కవులు, రాజులు, కాంతామ తల్లులు,
యుద్ధ వీరులు, రాజ్యాంగవేత్తలు...
Title | నా స్మృతి పథంలో సాగుతున్న యాత్ర |
Writer | అచంట జానకిరామ్ |
Category | చరిత్ర |
Stock | 100 |
ISBN | -- |
Book Id | EBM001 |
Pages | 552 |
Release Date | 01-Nov-2013 |