ఎమెస్కోవారి ”రాతిపూవులో రాలినముత్యాలు” ”విజయ” ”కలలకెరటాలపై కన్నె పడవలు” నవలల ద్వారా అత్యంత పాఠకాదరణ పొందిన శ్రీమతి అధరాపురపు తేజోవతిగారు ”కోయిల పిలిచింది”, కనువిప్పు (అనుబంధ) వంటి నవలలే కాకుండా వివిధ పత్రికల్లో ప్రచురింపబడిన యాభైకి పైగా కథలు, రేడియోలో ప్రసారమైన దాదాపు ఎనభైకథల ద్వారా పాఠకులకు సుపరిచితం. వీరి ‘చిన్న చేప’ కథకు ఆంధ్రజ్యోతికథల పోటీలో కన్సోలేషన్ బహుమతి, శ్రీనాథపీఠం ఆధ్వర్యంలో శ్రీమతి స్వరాజ్యలక్ష్మి- పురుషోత్తమరావుల అవార్డులు లభించాయి. ఇంకా ఎందరో ప్రముఖులచే కవి సమ్మేళనాలలో ఎన్నో సన్మానాలు అందుకున్నారు. వీరి నవలలు కొన్ని వాషింగ్టన్ లైబ్రరీలోని ‘ఇంటర్నేషనల్ బుక్ లైబ్రరీ’లో చోటు చేసుకోవడం విశేషం.
పూర్వాసంధ్యాప్రవర్తతే, మృత్యోర్మ అమృతంగమయా కన్నడంలోకి తర్జుమా కాబోతున్నాయి. తన రచనలలో ఏదో ఒక మెసేజ్ తప్పకుండా ఉండితీరాలని విశ్వసించే వీరి పూర్వాసంధ్యాప్రవర్తతే ప్రస్తుతం మీ ముందున్న ఓ మంచి నవల.