--
గిడుగు వెంకటరామమూర్తి (12.08.1863- 22.01.1940) గిడుగు పిడుగుగా ప్రసిద్ధులు. రావుబహదూర్ బిరుదాంచితులు. వ్యావహారిక భాషోద్యమ పితామహులు. గత శతాబ్దంలో తెలుగుభాష ఆధునికీకరణ పక్రియలో అగ్రగాములు. సంప్రదాయ గ్రాంథికవాద పండితులవాదంలోని డొల్లతనాన్నీ, వారి గ్రంథాలలోని లకణ విరుద్ధప్రయోగాలనూ ఎండగట్టిన పండితుడు. తెలుగుభాషకు అపారమైన సేవచేసిన మహానుభావుడు.
తెలుగులో తొలి ఆధునిక భాషాశాస్త్రవేత్తగా చెప్పుకొనదగిన గిడుగు రామమూర్తిగారు సవరభాషకు చేసిన సేవ ఎనలేనిది. ఆంధ్రపండిత భిషక్కులభాషా భేషజము, బాలకవిశరణ్యము, సవర-ఇంగ్లీషు నిఘంటువు, సవర రీడర్లు, ఎ మెమొరాండమ్ ఆన్న్ మోడర్ తెలుగు, ఎ మాన్యువల్ అఫ్ సవర లాంగ్వేజ్, సూర్యరాయాంధ్ర నిఘంటు విమర్శనము, గద్యచింతామణి మొ।।నవి గిడుగువారి ముఖ్యమైన రచనలు.
గిడుగు రామమూర్తిగారు రచించిన సవర వాచకాలకు తెలుగు అనువాదమే ఈ గ్రంథం. సవర భాషా సంస్కృతులను తెలుసుకోవడానికి అత్యంత ఉపయుక్త గ్రంథం.
Title | సవరకథలు |
Writer | గిడుగు వెంకటరామమూర్తి |
Category | భాషాసాహిత్యాలు |
Stock | 100 |
ISBN | 978-93-83652-43-3 |
Book Id | EBM063 |
Pages | 256 |
Release Date | 16-Feb-2013 |