మొదట్లో విశాలాంధ్రను సమర్థించినా, తరువాత తెలంగాణవారికి జరిగిన అన్యాయాలు,వారి భాషను, సంస్కృతిని, అలవాట్లను అవహేళన చేయటం చూసి తెలంగాణాకు అనుకూలంగా మారినాను…
మహాపురుషులకు మాత్రమే ఆత్మకథలవసరమనేది నేనంగీకరించను. నావంటివారి జీవితము ఇతరులకు ఆదర్శప్రాయం కాకపోవచ్చు. కాని ఈ పుస్తకం వలన నిజాం పాలనలో మాపల్లెల పరిస్థితి, అప్పటి ఆచారాలు, అలవాట్లు, సామాజిక స్థితి, నైతిక విలువలు వంటి ఎన్నోవిషయాలు ఇప్పటివారికి తెలిసే అవకాశముంది. చరిత్రతో పనిలేదనుకునే వారికి తప్ప ఇతరులందరికీ ఇటువంటివి అవసరమే.