కొండ వేంకటప్పయ్య పంతులు (స్వీయచరిత్ర)
ఫిబ్రవరి 2, 1866 న జన్మించిన కొండ వేంకటప్పయ్యగారు భారత స్వాతంత్య్ర సంగ్రామచరిత్రలో ముఖ్యంగా ఆంధ్రదేశ జాతీయోద్యమంలో చిరస్థాయిగా నిలిచిపోయారు. దేశభక్త బిరుదును పొందారు. వారి జన్మకాలం నుండి 1932 వరకు వారి ఆత్మకథ ఇది. ఆనాటి జాతీయోద్యమ చరిత్ర నేపథ్యంగా కలిగిన ఈ ఆత్మకథను ఒకవిధంగా జాతీయోద్యమ గాథగానే భావించాలి. దేశభక్త జీవితానికీ, దేశ చరిత్రకూ అభేదమే. వేంకటప్పయ్య పంతులుగారు 1948 ఆగస్టు 15 న స్వర్గవాసి అయ్యారు.