--
గణితం అమూర్తమయిందనీ, పిల్లలు త్వరగా అర్థం చేసుకోలేరనీ అంటుంటారు. కాని అది సరియైనది కాదంటారు రచయిత పోరెడ్డి అశోక్. ‘పిల్లలు-లెక్కలు-టీచరు’ ఈ ముగ్గురికీ అవినాభావ సంబంధముంది. పిల్లలు ఒకటవ తరగతిలో అంకెలు నేర్చుకోగానే ప్రథమంగా టీచరు నేర్పించేవి, ఎక్కాలు. పిల్లలకి ఎక్కాలు ముందు నేర్పాలా? గుణకారం ముందు నేర్పాలా? అనే విషయంలో ఉపాధ్యాయుల మధ్యనే భిన్నాభిప్రాయాలున్నాయి. కాని ఈ పుస్తక రచయిత ”పిల్లవాడు తప్పుచేస్తున్నాడు అంటే, అది అతని తప్పుకాదనీ, అవగాహనా రాహిత్యమేననీ” అంటాడు. గణితమంటే గాభరాపడే విద్యార్థులకీ ముందుగానే, గుణకార, భాగాహారాలే కాకుండా భిన్నములయెడ కూడా చక్కటి అవగాహనని కలిగిస్తే, పిల్లలు లెక్కల యెడ గల తమ భయాన్ని దూరం చేసుకొని ‘లెక్కలంటే మాకోలెక్కా’ అంటారు. అందుకే చిన్న పిల్లలకీ లెక్కలు బోధించే ప్రతి ఉపాధ్యాయుడు, అనుభవజ్ఞుడయిన గణిత ఉపాధ్యాయుడు రాసిన ఈ ‘పిల్లలు-లెక్కలు-టీచరు’ పుస్తకాన్ని తప్పకుండా చదివి గణితబోధనలోని మెలకువలు తెలుసుకోవల్సిందే.
Title | పిల్లలు-లెక్కలు-టీచరు |
Writer | పోరెడ్డి అశోక్ |
Category | ఇతరములు |
Stock | 100 |
ISBN | 00 |
Book Id | EBI025 |
Pages | 56 |
Release Date | 01-Mar-2014 |