(ఒడియా మూలం) ప్రతిభారాయ్;
అనువాదం : జయశ్రీ మోహన్రాజ్
కామాంధులయిన పురుషులచేత సుందరీమణులు యుగయుగాలుగా బాధపడి అవమానాలకు గురౌతున్నారు. కాని అన్నదమ్ముల వివాదంలో ఈర్ష్యాసూయల మధ్య నలిగి అయిన వారి మధ్యా, జ్ఞానులు, గుణవంతులు గౌరవనీయులైన పురుషుల సమక్షంలో స్త్రీని వివస్త్రను చేయడం, అందరు నిరుత్తరులయి వివస్త్ర అయిన స్త్రీ అంగ విన్యాసాలను చూస్తూ ఉండేటువంటి కళంకిత అధ్యాయం ఇప్పటివరకు ప్రపంచ చరిత్రలో లేనేలేదు. యాజ్ఞసేని స్త్రీత్వానికే మారుపేరు. కర్మ, జ్ఞానం, శక్తి మూర్తీభవించిన దేవి యాజ్ఞసేని ద్రౌపది. తన సతీత్వం, ఉత్తమత్వం వలన కౌరవుల ద్వారా కర్ణుడి దృష్టిలోనూ బహూపురుష భోగ్యురాలిగా, భోగం స్త్రీగా అడుగడుగునా అవమానాలకు గురికావలసి వచ్చింది కృష్ణ. ద్వాపరయుగంలోని అసామాన్యమైన విదుషీమణి, భక్తురాలు, శక్తిమంతురాలయిన స్త్రీ కృష్ణ. ఆమెను గురించి ప్రచారంలోగల అనుచిత వ్యాఖ్యలు, భిన్న అభిప్రాయాలకు దీటుగా ఈ ‘యాజ్ఞసేని’ నవల విశదపరచి పాఠకులను ఆలోచింపచేస్తుంది.