భోజన భోగాన్ని సారమెరిగి చూసిన శ్రీనాథుడు, తన నైషథంలోని బువ్వబంతిలో నాటి చతుర్విథాహారాలలోని పలురకాల వంటకాలను మనకు కమ్మగా వడ్డించాడు. కానీ, వాటి విశేషాలన్నింటినీ చర్చించే గ్రంథం గాని, పరిశోధన గానీ విడిగా ఇంతవరకూ రాలేదని భావిస్తున్నాను. శాసనాలలో మాత్రం, వైష్ణవ ప్రాబల్యం పెరిగిన తర్వాత పలువంటకాల ముచ్చట్లు వస్తాయి.
ఇదొక విలక్షణమైన రచన.
ఒక ఆయుర్వేద వైద్యుడు – ఒక భాషా సాహిత్య పరిశోధకుడు, ఒక సాంస్కృతిక చరిత్రకారుడు, ఒక సంప్రదాయ గాడాభిమాని… కలిసి, శ్రమించి రచిస్తే, ఇలాంటి రచన వెలువడుతుంది!