కర్త:- విద్వాన్ తాడిచెర్ల వీరరాఘవశర్మ (పరిష్కర్త :- కపిలవాయి లింగమూర్తి)
హిందువులు మరణానంతరం చేసే కర్మ వారికీ ప్రేతత్వం నుండి మరియు భూలోకం వాతావరణం నుండి ముక్తిని కలిగిస్తుంది.
తులసివనంలో ఉంచిన శవం శుష్కిస్తుందికాని క్రుళ్లదంటారు. ఈ విధంగా తులసికి వాతావరణాన్ని శుభ్రపరచే గుణముంది.
ఇంటిలో వెలిగించిన దీపం. వ్యక్తి మరణించిననాడు ఆర్పినదానికి వ్యతిరేకం. ఆనాడింటిలో ఒక జ్యోతి ఆరిపోయింది కాబట్టి దానికి బదులుగా ఇపుడు మరొకటి వెలిగిన ఇంటిలోనికి అతడు అడుగుపెట్టుతున్నాడు.
మరణానికి పంచత్వం అని పేరు. అనగా ఈ భౌతికకాయం పంచభూతాలలో చేరిపోవటం అని తాత్పర్యం. వానిలో అగ్ని-జల-భూములు మూడు స్థూల భూతాలు. తక్కినవి సూక్ష్మాలు.