చిట్టిగూడూరు
శ్రీమత్తిరుమల గుదిమెళ్ల వరదాచార్యులవారి జీవితం
సార్థకమైన ‘కులపతి’ బిరుదాంకితులు శ్రీమత్తిరుమల గుదిమెళ్ల వరదాచార్యుల వారి జీవిత కథ ఇది. గత శతాబ్దంలో ప్రాచ్యభాషా ప్రాభవానికి ముఖ్యంగా సంస్కృత భాషా సాహిత్య ప్రచారానికి ప్రతీక శ్రీ వరదాచార్యులు. వారి స్వగ్రామం చిట్టిగూడూరులో వారు స్థాపించి నడిపిన శ్రీ నారసింహ సంస్కృత కళాశాల సంస్కృత విద్య సముద్ధరణంలో ప్రముఖపాత్ర వహించింది. నిరాడంబరులు, త్యాగధనులు, వదాన్యులు, ఉత్తమ ఆచార్యులు, కవి పండితులూనైన వరదాచార్యుల వారు చిట్టిగూడూరు వరదాచార్యులుగా తమ గ్రామ నామంతో ప్రసిద్ధులయ్యారు. వారివల్ల చిట్టిగూడూరు గ్రామం వాసికెక్కింది.