వరంగల్ జిల్లా నర్సంపేటలో అయినవోలు మోహనరావు, ప్రమీలాదేవి దంపతులకు 1953లో పుట్టారు.
వీరు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులు గానూ, భాషాభివృద్ధి పీఠానికి పీఠాధిపతిగా, నిఘంటునిర్మాణ శాఖకు శాఖాధిపతిగానూ పనిచేశారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ భాషాశాస్త్ర సదస్సులలో పాల్గొని పత్ర సమర్పణలు చేసిన వీరు ఇంగ్లీషు, తెలుగు భాషల్లో సుమారు 60కి పైగా వ్యాసాలు ప్రచురించారు Acquisition of Telugu syntax (1990, New Delhi),), ధ్వన్యనుకరణ పదకోశం (2001, పొ.శ్రీ. తెలుగు విశ్వవిద్యాలయం Issues on Lexicography 2006, Addis Ababa University ELRC, (Ethiopia), Andhra Bhasha bhushanamu : Original Text with Transliteration, Meaning, Translation and Linguistic Interpretation (2009 Emesco, Hyderabad), Applied Linguistics (Editor, paper II ELT; PSTU) అనే గ్రంథాలను ప్రచురించారు. వివిధ విశ్వవిద్యాలయాల భాషాశాస్త్ర శాఖలలో రిసోర్స్ పర్సన్గా, యుజిసి విజిటింగ్ ఫెలోగా ఆహ్వానిత ఉపన్యాసాలిచ్చారు. పాఠ్యసంఘాలలో సభ్యులుగా, పరీక్షకులుగా సేవలందించారు. సైద్ధాంతిక, అనువర్తిత భాషాశాస్త్ర రంగాలతోపాటు, తెలుగు సాహిత్యం, సంప్రదాయ వ్యాకరణాలు కూడా ఉషాదేవిగారికి అభిమాన అధ్యయన విషయాలు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2001లో వీరికి 'ఉత్తమ ఉపాధ్యాయ' పురస్కారాన్నిచ్చింది.
2012 లో తెలుగు విశ్వవిద్యాలయం ఉషాదేవిగారిని కీర్తిపురస్కారంతో సత్కరించింది.